ఈరోజు ఏపీ కేబినెట్ భేటీకానుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశంకానున్న మంత్రివర్గం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై చర్చించనున్నారు. అయితే, కరోనా కారణంగా సమావేశాలను వాయిదా వేయాలని భావిస్తోన్న జగన్ ప్రభుత్వం ఒకవేళ నిర్వహించదలిచితే ఈనెల 16నుంచి జరపాలని చూస్తోంది. అదే జరిగితే, ఈనెల 18న ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశముంది. అయితే, ఇప్పుడు బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలా వద్దా అనేది ఇవాళ్టి కేబినెట్ మీటింగ్లో తేల్చనున్నారు.