పసికందు లాంటి ఏపీని చంద్రబాబు నాశనం చేశారు: బొత్స

Update: 2019-06-15 07:57 GMT

రాజధానిపై అపోహలు అనవసరమన్నారు మునిసిపల్ మంత్రిగా బొత్స సత్యనారాయణ. సచివాలయం ఐదో బ్లాక్‌లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన రాజధాని ప్రాజెక్టుల్లో అవినీతిని వెలికి తీస్తామని స్పష్టం చేశారు. విభజన తర్వాత పసికందు లాంటి ఏపీని చంద్రబాబు నాశనం చేశారని ఆరోపించారు. చెప్పింది చేస్తాం చేసేదే చెప్తాం ఇదే జగన్ సర్కార్ విధానమన్నారు. చంద్రబాబును తనిఖీ చేయడం అధికార విధుల్లో భాగమేనని ఈ వ్యవహారాన్ని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదన్నారు. దేశంలో చాలా మంది ప్రతిపక్ష నేతలను తనిఖీ చేస్తున్నారని బొత్స పేర్కొన్నారు. 

Tags:    

Similar News