నవ్యాంధ్ర రాజధాని అమరావతి తరలింపును నిరసిస్తూ రాజధాని రైతులు చేపట్టిన ఆందోళనలు 61వ రోజుకి చేరుకున్నాయి. మందడం, తుళ్లూరులో ధర్నా. వెలగపూడిలో రిలే దీక్షలు జరుగుతున్నాయి. మిగతా రాజధాని గ్రామాల్లోనూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. నేడూ రైతుల 24 గంటల దీక్షలు కొనసాగనున్నాయి. ఇదిలా ఉంటే.. నేడు తుళ్లూరులో జేఏసీ నేతృత్వంలో అమరావతి ధూమ్ ధామ్ కార్యక్రమం జరగనుంది.