జగన్ సమక్షంలో వైసీపీ చేరిన సినీనటుడు అలీ చేరారు. తన అనుచరులతో కలిసి వచ్చి లోటస్ పాండ్ కు వచ్చిన ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరిన అనంతరం మాట్లాడిన అలీ.. ఆంధ్ర ప్రజలు జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని వెల్లడించారు. పార్టీ ఆదేశిస్తే రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తానని చెప్పారు. తాను మనస్ఫూర్తిగా వైసీపీలో చేరుతున్నానని అలీ వెల్లడించారు. జగన్ ఒకవేళ అవకాశం ఇస్తే రాజమండ్రి లేదా, విజయవాడ నుంచి పోటీ చేస్తానని ఆయన చెప్పారు. దీంతో అలీ ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తేలిపోయింది. జనసేన ప్రభావం ప్రజలు నిర్ణయిస్తారని తెలిపారు.