కోడెల ల్యాప్ట్యాప్ మాయమైన కేసులో కొత్త ట్విస్ట్
సత్తెనపల్లి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో గతంలో అదృశ్యమైన ల్యాప్టాప్లు వెలుగులోకి వచ్చాయి.
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు స్వాధీనంలో ఉన్న అసెంబ్లీ ఫర్నిచర్ను అతని తనయుడికి చెందిన షోరూమ్లో గుర్తించిన ఘటన మరువక ముందే మరో దోపిడి బయటపడింది. సత్తెనపల్లి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో గతంలో అదృశ్యమైన ల్యాప్టాప్లు వెలుగులోకి వచ్చాయి. మొన్న మాయమైన ల్యాప్ట్యాపులు అనూహ్యాంగా ఆర్డీఏ ఆఫీసులో ప్రత్యక్షమయ్యాయి. కోడెల కుమారుడు ల్యాప్టాప్ తీసుకెళ్లారని సత్తుపల్లిలో ఇప్పటికే అధికారులు ఫిర్యాదుచేసిన తరుణంలో ల్యాప్టాప్ దొరకడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.