రాజీనామా చేసే యోచనలో టీడీపీ ఎంపీలు?

Update: 2019-02-13 03:39 GMT

ప్రత్యేక హోదా పోరాటంలో టీడీపీ కేంద్రంపై మరో అస్త్రం ప్రయోగించేందుకు రెడీ అయింది. ఇవాళ్టితో 16వ లోక్ సభ ముగియనుండటంతో సభలో వాయిస్ వినిపించే అవకాశం ఉండదు కాబట్టి టీడీపీకి చెందిన 15 మంది లోక్‌ సభ ఎంపీలు రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రత్యేక హోదా, విభజన చట్టం అమలు కోసం చంద్రబాబు చేపట్టిన నిరసన దీక్షకు కొనసాగింపుగా ఎంపీలు రాజీనామా చేస్తునట్టు తెలుస్తోంది. ఎంపీలంతా మూకుమ్మడిగా రాజీనామా చేస్తే దాని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని టీడీపీ భావిస్తోంది. ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చ జరిగే అవకాశముందని టీడీపీ నమ్ముతోంది. 

Similar News