జిల్లా అధికారులతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ వరుస భేటీలు

SEC Nimmagadda Ramesh is meeting district officials
x

ఫైల్ ఇమేజ్


Highlights

Andhra Pradesh: మున్సిపల్ ఎన్నికల నేపధ్యంలో జిల్లాల అధికారులతో.. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ వరుస భేటీలు కొనసాగుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్:మున్సిపల్ ఎన్నికల నేపధ్యంలో జిల్లాల అధికారులతో.. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ వరుస భేటీలు కొనసాగుతున్నాయి. నిన్న సీమ జిల్లాల అధికారులతో సమావేశమైన ఎస్ఈసీ ఇవాళ మరో నాలుగు జిల్లాల అధికారులతో బేటీకానున్నారు. మధ్యాహ్నం 3గంటలకు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల అధికారులతో నిమ్మగడ్డ సమావేశం కానున్నారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు, భద్రతా చర్యలపై అధికారులతో చర్చించనున్నారు. అధికారులతో భేటీ అనంతరం, సాయంత్రం రాజకీయ పార్టీల నేతలతో ఎస్ఈసీ సమావేశమవుతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories