పోటీ పరీక్షలకు హాజరయ్యేవారికి తెలంగాణా ప్రభుత్వ ఉచిత శిక్షణ

పోటీ పరీక్షలకు హాజరయ్యేవారికి తెలంగాణా ప్రభుత్వ ఉచిత శిక్షణ
x
Highlights

ఐబీపీఎస్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లలో ఉద్యోగాల కోసం పరీక్షలు రాయబోతున్న వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంబించబోతోంది.

ఐబీపీఎస్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారికోసం తెలంగాణలోని గిరిజన స్టడీ సర్కిళ్లలో ఉచిత శిక్షణకు బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. దీనిలో 100 మందికి మాత్రమే ప్రవేశాలు కల్పించనున్నారు. ఎంపికైనవారికి 45 రోజులపాటు ప్రత్యేక శిక్షణ ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 9న ప్రారంభంకాగా.. సెప్టెంబరు 23తో ముగియనుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం 040-27540104 ఫోన్ నెంబరులో సంప్రదించవచ్చు. అక్టోబరు 3 నుంచి శిక్షణ ప్రారంభం అవుతుంది.

దరఖాస్తు చేసుకోవడానికి వీరు అర్హులు..

- ఎస్టీ, ఎస్సీ, బీసీ కులాలకు చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

- గుర్తింపు పొందిన ఏదైనా ఏదైనా విద్యాసంస్థ నుంచి డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.

- అభ్యర్థుల వయసు 01.06.2019 నాటికి 18 - 40 సంవత్సరాల మధ్య ఉండాలి.

- కుటుంబ వార్షిక ఆదాయం ఎస్సీ, ఎస్టీకు రూ.2 లక్షలు, బీసీలకు రూ.1 లక్షకు మించకూడదు.

- ఉద్యోగం చేస్తున్నవారు, చదువుకుంటున్న వారు, తెలంగాణ, లేదా దేశంలోని ఇతర ప్రభుత్వ స్టడీ సర్కిళ్లలో శిక్షణ తీసుకుంటుననవారు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు.

- తెలంగాణకు చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

- అభ్యర్థులు ఐబీపీఎస్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం అర్హతలు కలిగి ఉండాలి.

- గతంలో శిక్షణ తీసుకున్నవారు దరఖాస్తు చేసుకోవడానికి వీల్లేదు.

- మొత్తం 100 సీట్లలో రిజర్వేషన్ల ప్రకారం ఎస్టీలకు 75%, ఎస్సీలకు 15%, బీసీలకు 10% సీట్లను కేటాయిస్తారు. ఒక్కో విభాగం నుంచి మహిళా కోటా కింద 33% సీట్లను కేటాయిస్తారు.

ఎంపిక ఇలా..

పదోతరగతి, ఇంటర్, డిగ్రీలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఎంపికైనవారికి ఉచిత శిక్షణతోపాటు.. పుస్తకాలు, వసతి సదుపాయాల కోసం ఆర్థిక సాయం కూడా అందిస్తారు.


Show Full Article
Print Article
Next Story
More Stories