Andhra Pradesh: 1-10 విద్యార్థులకు టీవీ పాఠాలు.. టైమింగ్స్ ఇవే

Andhra Pradesh: 1-10 విద్యార్థులకు టీవీ పాఠాలు.. టైమింగ్స్ ఇవే
x
Highlights

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో విద్యాసంస్థలు మూడపడిన విషయం తెలిసిందే. దీంతో విద్యార్ధులంతా ఇండ్లకే పరిమితం కావడంతో వారి విలువైన సమయం వృద్దా...

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో విద్యాసంస్థలు మూడపడిన విషయం తెలిసిందే. దీంతో విద్యార్ధులంతా ఇండ్లకే పరిమితం కావడంతో వారి విలువైన సమయం వృద్దా అయిపోతుంది. దీంతో అటు ప్రభుత్వం ఇటు విద్యాశాఖ అధికారులు ఓ నిర్ణయానికి వచ్చారు. విద్యార్థులకు నష్టం కలగకుండా, విద్యా బోధనకు ఆటంకాలు లేకుండా ఉండేందుకు నేటి నుంచి అంటే జూన్ 10వ తేది నుంచి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు దూరదర్శన్‌ సప్తగిరి ఛానల్‌ ద్వారా పాఠాలు ప్రసారం చేయనున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు బ్రిడ్జి కోర్సు బోధించనున్నారు. అదే విధంగా 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు సబ్జెక్టు పాఠాలను బోధించనున్నారు. అంతే కాదు ప్రత్యేకంగా రూపొందించిన బ్రిడ్జి కోర్సు పుస్తకాలను 1-5 తరగతి విద్యార్థులకు అందిస్తారు. పదోతరగతి విద్యార్థులకు ప్రస్తుతం నిర్వహిస్తున్న రెండు గంటల కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. ఇక ఆన్ లైన్లో క్లాసులను విన్న విద్యార్ధులకు ఏమైనా సందేహాలు ఉంటే వాటిని నివృత్తి చేసేందుకు ఉపాధ్యాయులు వారానికి ఒక్కసారి పాఠశాలకు వస్తారు. విద్యార్ధులు ఆ రోజున పాఠశాలకు వెళ్లి వారికి ఉన్న సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఇంగ్లిష్‌, మ్యాథ్స్‌, తెలుగు సబ్జెక్టులను ఇంగ్లిష్‌ మీడియంలోనే బోధిస్తారు. జూన్‌ చివరి వరకు ఈ తరగతులు నిర్వహిస్తారు.

పాఠ్యాంశాలు బోధించే సమయ వేళలు ఇవే..!

* ఉదయం 11 నుంచి 11.30 గంటల వరకు 1, 2 తరగతుల పాఠ్యాంశాలు బోధించనున్నారు.

* ఉదయం 11.30 నుంచి 12 గంటల వరకు 3, 4, 5 తరగతులకు పాఠ్యాంశాలు బోధించనున్నారు.

* మధ్యాహ్నం 2 నుంచి 3గంటల వరకు 6, 7 తరగతులకు పాఠ్యాంశాలు బోధించనున్నారు.

* మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 8, 9 తరగతులకు పాఠ్యాంశాలు బోధించనున్నారు.

ఉపాధ్యాయులు అందుబాటులో ఉండే వేళలు..

* 17వ తేదీ నుంచి ప్రతి బుధవారం 6-7 తరగతులకు బోధించే ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు పాఠశాలల్లో అందుబాటులో ఉంటారు.

* 19 నుంచి ప్రతి శుక్రవారం నుంచి 8-9 తరగతులకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుడు అందుబాటులో ఉంటారు.

* ప్రతి బుధవారం, శుక్రవారాలు పదో తరగతికి బోధించే ఉపాధ్యాయులు అందుబాటులో ఉండనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories