YS Sharmila: నేడు ఇందిరాపార్క్‌ వద్ద షర్మిల రైతు వేదన దీక్ష

YSRTP Chief YS Sharmila will Start Initiation for 72 Hours at Indira Park Today 13 11 2021
x

నేడు ఇందిరాపార్క్‌ వద్ద షర్మిల రైతు వేదన దీక్ష(ఫైల్ ఫోటో)

Highlights

* 72 గంటల పాటు దీక్ష నిర్వహణ * ఒక రోజు ధర్నా చౌక్‌లో..మరో రెండు రోజులు లోటస్ పాండ్ వద్ద దీక్ష

YS Sharmila: రాష్ట్ర రైతులకు అండగా నిలిచేందుకు వైఎస్‌ షర్మిల ఇవాళ్టి నుంచి 72 గంటలపాటు నిరాహార దీక్ష చేపడతారని వైఎస్‌ఆర్టీపీ తెలిపింది. వరి ధాన్యం కొనుగోలు చేయబోమని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నందన ఇందిరా పార్కు వద్ద రైతు వేదన పేరుతో ఈ దీక్షను ప్రారంభిస్తున్నట్లు పేర్కొంది.

ప్రభుత్వం అనుమతివ్వని కారణంతో ఇందిరా పార్కు వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించి అనంతరం లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో మిగిలిన దీక్షను షర్మిల పూర్తి చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ధర్నా చౌక్‌లోనే 72 గంటల దీక్ష కోసం దరఖాస్తు చేయగా ఒక రోజు నిర్వహించుకునేందుకు పోలీసులు అనుమతినిచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories