తెలుగు సినీహాస్య నటుడు మేణుమాధవ్ అనారోగ్యం కారణంగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
తెలుగు సినీహాస్య నటుడు మేణుమాధవ్ అనారోగ్యం కారణంగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కానీ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఒక ఉత్తరాది క్రికెటర్ యూసఫ్ పఠాన్ వేణుమాధవ్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తి చేశారు. తెలుగు హాస్య నటుడు వేణు మాధవ్ ఇకలేరు అనే వార్త షాక్కు గురిచేసిందన్నారు. వెండి తెరపై తాను చూసిన మంచి కమెడియన్స్లో వేణుమాధవ్ ఒకరని అన్నారు. అతడు లేని లోటు ఎవరు భర్తీ చేయలేరని ట్వీట్ చేశారు. వేణు మాధవ్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నానని యూసఫ్ పఠాన్ ట్వీట్ చేశారు. యూసఫ్ పఠాన్ కు వేణుమాధవ్ ఎలా తెలుసు అనే అనుమానం అందరి మదిలో తలుస్తుంది. కాగా.. వేణుమాధవ్ నటించిన కొన్నితెలుగు సినిమాలు హిందీలో డబ్బింగ్ అయ్యాయి. వాటిలో కొన్ని సినిమాలకు ఈ క్రికెటర్ డబ్బింగ్ చూశాడని తెలుస్తోంది. హిందీ డబ్బింగై హిట్ సాధించిన సై వంటి సినిమాల్లో యూసఫ్ పఠాన్ వేణుమాధవ్ ను చూసినట్లుగా మరో టాక్ వినిపిస్తోంది.
Shocking to hear the demise of Venu Madhav. He was one of the irreplaceable and finest comedians I've seen on the silver screen. Deep condolences to his family and friends. pic.twitter.com/qxPl63WpwH
— Yusuf Pathan (@iamyusufpathan) September 26, 2019
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire