కలెక్టర్ కారును ఢీకొన్న లారీ..తృటిలో తప్పిన పెను ప్రమాదం

కలెక్టర్ కారును ఢీకొన్న లారీ..తృటిలో తప్పిన పెను ప్రమాదం
x
Highlights

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆమె ప్రయాణిస్తున్న కారును ఎదురుగా...

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆమె ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న ఓ లారీ అదుపుతప్పి ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో కలెక్టర్ ఉన్నారు. అయితే ఈ ప్రమాదంలో కలెక్టర్ వాహనం పూర్తిగా ధ్వంసం అయింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ దెబ్బలు తగలకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తివివరాల్లోకెళితే భువనగిరి మండలం అనాజీపురం, నందనం గ్రామాల మధ్య గురువారం (అక్టోబర్ 15) సాయంత్రం ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

వలిగొండ మండలంలోని పలు గ్రామాల్లో.. అకాల వర్షంతో నష్టపోయిన పంట పొలాలను కలెక్టర్ అనితా రామచంద్రన్ గురువారం పరిశీలించారు. ఆ తరువాత అక్కడి నుంచి తిరుగు ప్రయాణం ప్రారంభించారు. సరిగ్గా అదే సమయానికి ఎదురునుంచి వస్తున్న ఓ లారి అదుపుతప్పి కలెక్టర్ వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. లారీ డ్రైవర్ అజాగ్రత్త వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories