Peddapalli: ప్రియుడి ఇంటిముందు ప్రియురాలి నిరసన

Woman Protest in Front of Boyfriend House in Peddapalli District
x

పెద్దపల్లి జిల్లాలో ప్రియుడి ఇంటిముందు బైఠాయించిన ప్రియురాలు 

Highlights

Peddapalli: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ కు చెందిన సంజీవ్ తో మూడేళ్లుగా ప్రేమ

Peddapalli: పెద్దల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకొని ఇప్పుడు ముఖం చాటేయడంతో తనకు న్యాయం చేయాలని ప్రియుడి ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపింది బాధిత మహిళ. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ కు చెందిన చొప్పరి సంజీవ్, శిరీష గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెద్దలను ఆశ్రయించడంతో వారి సమక్షంలో స్థానిక దేవాలయంలో దండలు మార్చుకొని వివాహం చేసుకున్నారు. అనంతరం సంజీవ్ తన అన్నకు పెళ్లయిన తరువాత ఇంటికి తీసుకెళ్తానని చెప్పడంతో మహిళ అంగీకరించింది. కానీ శిరీషతో తనకు సంబంధం లేదని ప్రియుడు సంజీవ్ చెప్పడంతో బాధితురాలు ఖంగుతింది. దీంతో తనకు న్యాయం చేసే వరకు కదిలేది లేదని ప్రియుడి ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపింది. అధికారులు, ప్రజాప్రతినిధులు తనకు న్యాయం చేయాలని వేడుంటోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories