శంషాబాద్‌లో దారుణం.. మహిళ మృతదేహం కలకలం

శంషాబాద్‌లో దారుణం.. మహిళ మృతదేహం కలకలం
x
shamshabad women brutally killed
Highlights

ప్రియాంక రెడ్డి అత్యాచారం హత్య ఘటన మరువక ముందే శంషాబాద్‌లో మరో దారుణం వెలుగు చూసింది.

ప్రియాంక రెడ్డి అత్యాచారం హత్య ఘటన మరువక ముందే శంషాబాద్‌లో మరో దారుణం వెలుగు చూసింది.శంషాబాద్‌ పరిధిలో గుర్తుతెలియని దుండగులు ఓ మహిళను దారుణంగా హత్య మృతదేహాన్ని కాల్చివేశారు. సుమారు మహిళ వయసు 35 ఏళ్ల వరకు ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. శంషాబాద్ సమీపంలోని సిద్ధులగుట్ట దగ్గర శుక్రవారం రాత్రి సమయంలో ఈ దారుణం జరిగింది. రెండు రోజులు వ్యవధిలోనే శంషాబాద్ పరిథిలో ఇద్దరు మహిళలు హత్య జరగడం స్థానికంగా కలకలం రేపుతోంది.

మహిళ మృతదేహం మంటల్లో తగలబడుతున్న దృశ్యాలను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.‎ స్థానికుల సమాచారంలో ఘటనస్థలికి పోలీసులు చెరుకున్నారు. మహిళ మహిళమృదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మహిళపై అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories