ఉగ్రరూపం దాల్చిన ఆర్టీసీ కార్మికుల ఆందోళన..

ఉగ్రరూపం దాల్చిన ఆర్టీసీ కార్మికుల ఆందోళన..
x
Highlights

వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల ఆందోళన ఉగ్రరూపం దాల్చింది. భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లో ఆర్టీసీ కార్మికులు ఇద్దరు బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్‌...

వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల ఆందోళన ఉగ్రరూపం దాల్చింది. భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లో ఆర్టీసీ కార్మికులు ఇద్దరు బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్‌ ఎక్కి నిరసన తెలిపారు. దీంతో సహచర కార్మికులు భయాందోళనకు గురయ్యారు. కిందికి దిగాలంటూ కోరుతున్నారు. పోలీసులు కూడా వారిని కిందికి దిగాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దీంతో అక్కడి పరిస్థితి ఆందోళనకరంగా మారింది.

వరంగల్ జిల్లాలో ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన బంద్ కొనసాగుతుంది. కార్మికుల ఆందోళనకు మద్దతుగా బీజేపీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం సమస్యను పరిష్కరించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories