రేపు బీజేపీలో చేరనున్న విజయశాంతి

రేపు బీజేపీలో చేరనున్న విజయశాంతి
x
Highlights

ఎట్టకేలకు విజయశాంతి బీజేపీలో చేరేందుకు సిద్ధం అయ్యారు. కాషాయం కండువా కప్పుకునేందుకు ముహుర్తం ఫిక్స్ చేశారు. దీంతో ఆమె కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.

ఎట్టకేలకు విజయశాంతి బీజేపీలో చేరేందుకు సిద్ధం అయ్యారు. కాషాయం కండువా కప్పుకునేందుకు ముహుర్తం ఫిక్స్ చేశారు. దీంతో ఆమె కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. సోమవారం భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్న ఆమె సాయంత్రం అమిత్ షాతో భేటీ అవుతున్నారు. బీజేపీ ద్వారానే రాజకీయాల్లో అడుగుపెట్టిన రాములమ్మ సుమారు రెండు దశాబ్ధాల అనంతరం తిరిగి సొంత గూటికి చేరుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories