Kishan Reddy: ఉపఎన్నికలో గెలుపు కోసం టీఆర్ఎస్ కోట్లు తరలిస్తుంది

Union Minister Kishan Reddy Said TRS Party Moving Crores on Vehicles For Huzurabad Bypoll
x

కిషన్ రెడ్డి (ఫైల్ ఫోటో)

Highlights

* బీజేపీ ఓటమి కోసం కేసీఆర్‌ రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు * తెలంగాణలో కుటుంబపార్టీకి బుద్ధి చెప్పాలి

Kishan Reddy: తెలంగాణలో కుటుంబ పార్టీకి బుద్ధి చెప్పాలని అన్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. హుజూరాబాద్‌ ఉపఎన్నికలో ఈటల రాజేందర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. బీజేపీ ఓటమి కోసం సీఎం కేసీఆర్‌ రాత్రింబవళ్లు చర్చలు జరుపుతున్నారని, కోట్లు గుమ్మరిస్తున్నారని ఆరోపించారు. ఓటర్లను కేసీఆర్‌ ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా బీజేపీకే ఓట్లు పడతాయని ధీమా వ్యక్తం చేశారు కిషన్‌రెడ్డి. హుజూరాబాద్‌లో ధర్మమే గెలుస్తుందని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారం చేపడుతుందని జోస్యం చెప్పారు కిషన్‌రెడ్డి.

Show Full Article
Print Article
Next Story
More Stories