మేడారం జాతరలో భారీ వర్షం.. ఇద్దరు మహిళలు మృతి !

మేడారం జాతరలో భారీ వర్షం.. ఇద్దరు మహిళలు మృతి !
x
Highlights

తెలంగాణ మహా జాతర మేడారంలో వనదేవతల పండగ ముగింపు దశకు చేరుకుంది. వనదేవతలను దర్శించుకుని తిరుగు ప్రయాణమవుతున్న భక్తులు కొందరైతే మరికొందరు ఇంకా దర్శనం...

తెలంగాణ మహా జాతర మేడారంలో వనదేవతల పండగ ముగింపు దశకు చేరుకుంది. వనదేవతలను దర్శించుకుని తిరుగు ప్రయాణమవుతున్న భక్తులు కొందరైతే మరికొందరు ఇంకా దర్శనం చేసుకుంటున్నారు ఓవైపు పోటెత్తుతున్న భక్తులకు తోడు ఉదయం నుంచి జోరు వాన కురుస్తుండటంతో ఆప్రాంతమంతా జలమయమైపోయింది. జోరువాన కురుస్తున్నా ఎక్కడా భక్తులు వెనక్కు తగ్గడం లేదు వర్షపు నీటి మడుగుల్లోనే తడుసుకుంటూ దర్శనం చేసుకుంటున్నారు.

మహా జాతర మేడారంలో ఇద్దరు మహిళా భక్తులు మృతి చెందారు. జంపన్నవాగు వద్ద విద్యుత్‌ షాక్‌తో ఓ మహిళ మృతి చెందింది. మృతురాలు కరీనంగర్‌కు చెందిన మహిళగా గుర్తించారు. మరోపక్క భారీ వర్షానికి చెట్టు కూలీ మరో మహిళ మృతి చెందింది. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories