
Two Child Policy Telangana: ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత… సమాజ హితం కోసమా? రాజకీయ అవసరమా?
Two Child Policy Telangana: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కీలక మార్పు చోటుచేసుకుంది. పంచాయతీ రాజ్ చట్టంలో ఉన్న ‘ఇద్దరు పిల్లల నిబంధన’ను ఎత్తివేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో గ్రామపంచాయతీలు, మండల, జిల్లా స్థాయి స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అర్హతలపై ఉన్న పరిమితులు తొలగిపోయాయి. అయితే ఈ మార్పు సమాజానికి ఎంతవరకు మేలు చేస్తుందన్న అంశంపై విస్తృత చర్చ మొదలైంది.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ… ప్రస్తుతం ఈ నిబంధనను తొలగిస్తున్నప్పటికీ, భవిష్యత్తులో అవసరమైతే తిరిగి అమలు చేసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను విజయవంతంగా అమలు చేయడం వల్ల జనాభా వృద్ధి తక్కువగా ఉందని, దాంతో ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే రాజకీయ ప్రాతినిధ్యంలో అసమతుల్యత పెరుగుతోందని ఆమె అభిప్రాయపడ్డారు. జనాభా ఆధారంగా జరిగే నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలు నష్టపోయే పరిస్థితి ఉందని ప్రభుత్వం భావిస్తోంది.
మరోవైపు, ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ అవకాశాల కోసం కుటుంబ నియంత్రణ వంటి కీలక అంశాన్ని పక్కన పెట్టడం సరైన విధానం కాదని కొందరు విమర్శిస్తున్నారు. ఇప్పటికే దేశం జనాభా సమస్యతో పోరాడుతున్న నేపథ్యంలో, ఇలాంటి నిబంధనల తొలగింపు భవిష్యత్తులో ప్రతికూల ప్రభావాలు చూపవచ్చని వారు హెచ్చరిస్తున్నారు. మొత్తంగా చూస్తే, ఈ సవరణ ప్రజాస్వామ్య విస్తరణ కోసమా? లేక రాజకీయ సమీకరణల కోసమా? అన్న ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




