పార్టీ మారమని ఒత్తిడి ఉంది.. టీఆర్ఎస్ లో చేరికపై స్పందించిన టీడీపీ ఎమ్మెల్యే

పార్టీ మారమని ఒత్తిడి ఉంది.. టీఆర్ఎస్ లో చేరికపై స్పందించిన టీడీపీ ఎమ్మెల్యే
x
Highlights

టీటీడీపీ ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావు పార్టీ మారతారంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రచారంపై ఎమ్మెల్యే మచ్చా స్పందించారు....

టీటీడీపీ ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావు పార్టీ మారతారంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రచారంపై ఎమ్మెల్యే మచ్చా స్పందించారు. టీఆర్ఎస్ లో చేరమని తనపై ఒత్తిడి తెస్తున్నారని.. కానీ టీడీపీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నాని స్పష్టం చేశారు. శనివారం తిరుమల శ్రీవారిని దర్శినుకున్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 12 సీట్లలో పోటీచేసిన టీడీపీకి రెండు స్థానాలే దక్కాయి. గెలిచిన ఇద్దరిలో ఒకరు (సండ్ర వెంకటవీరయ్య) ఇప్పటికే టీఆరెస్ లో చేరిపోయారు. ఇక మిగిలింది ఒక్క ఆశ్వారావుపేట ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావు మాత్రమే. ఇటీవల భారీ ఎత్తున టీడీపీకి చెందిన కీలకనేతలు బీజేపీ తీర్ధం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన కూడా పార్టీ మారతారంటూ జోరుగా ప్రచారం జరిగింది. కానీ మచ్చా ఈ ప్రచారాన్ని కొట్టిపారేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories