తెలంగాణ అస్థిత్వానికి ప్రతీకగా టీఆర్‌ఎస్ ఆవిర్భావ వేడుకలు - కేటీఆర్

TS Minister KTR About TRS Formation Day 2022 Celebrations | Live News
x

తెలంగాణ అస్థిత్వానికి ప్రతీకగా టీఆర్‌ఎస్ ఆవిర్భావ వేడుకలు - కేటీఆర్

Highlights

KTR: హైటెక్స్‌లో టీఆర్‌ఎస్ ప్లీనరీ ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి కేటీఆర్...

KTR: టీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ శ్రేణులు పండుగగా జరుపుకుంటారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. హైటెక్స్‌లో నిర్వహించనున్న టీఆర్‌ఎస్ ప్లీనరీ ఏర్పాట్లను మంత్రి కేటీఆర్ పరిశీలించారు. టీఆర్‌ఎస్ పార్టీ ఏర్పడి 21 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, HICCలో ప్రతినిధుల మహాసభ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు కేటీఆర్ తెలిపారు. ఆవిర్భావ దినోత్సవానికి 3వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నట్లు తెలిపారు.

ఆహ్వానాలు అందినవారే సభకు రావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. గ్రామ శాఖల అధ్యక్షులు టీఆర్‌ఎస్ జెండాలను ఆవిష్కరించాలని సూచించారు. 3వేల 600 చోట్ల పట్టణాల్లో జెండా ఆవిష్కరణ చేయాలని కేటీఆర్ పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories