నామినేషన్‌ దాఖలు చేసిన టీఆర్ఎస్‌ రాజ్యసభ అభ్యర్థులు

నామినేషన్‌ దాఖలు చేసిన టీఆర్ఎస్‌ రాజ్యసభ అభ్యర్థులు
x
trs rajya sabha candidates file their nominations
Highlights

టీఆర్ఎస్‌ రాజ్యసభ అభ్యర్థులుగా కే. కేశవరావు, సురేష్‌రెడ్డిలు నామినేషన్‌ దాఖలు చేశారు. ఇరువురు తమ నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి అందజేశారు....

టీఆర్ఎస్‌ రాజ్యసభ అభ్యర్థులుగా కే. కేశవరావు, సురేష్‌రెడ్డిలు నామినేషన్‌ దాఖలు చేశారు. ఇరువురు తమ నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి అందజేశారు. రెండు సెట్ల నామినేషన్‌ వేశారు. సురేశ్‌రెడ్డి నామినేషన్‌ కార్యక్రమంలో మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. కేకే నామినేషన్‌ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు పాల్గొన్నారు. అంతకు ముందు గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం దగ్గర రాజ్యసభ అభ్యర్థులు కేకే, సురేష్‌రెడ్డి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ సంతోష్‌కుమార్‌, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories