బీజేపీ, కాంగ్రెస్‌లకు ధీటుగా భారీ బహిరంగ సభలకు టీఆర్‌ఎస్ ప్లాన్‌

TRS Plan to Public Meetings in Defiance of BJP and Congress
x

బీజేపీ, కాంగ్రెస్‌లకు ధీటుగా భారీ బహిరంగ సభలకు టీఆర్‌ఎస్ ప్లాన్‌

Highlights

*అభివృద్ధి కార్యక్రమాలు, విపక్షాలపై విమర్శలే లక్ష్యంగా కేసీఆర్‌ సభలు

CM KCR: వచ్చే ఎన్నికలే టార్గెట్‌గా గులాబీ బాస్ కేసీఆర్ ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇప్పటికే మంత్రి కేటీఆర్, హరీష్‌రావు జనంలో విస్త్రతంగా సుడిగాలి పర్యటనలు చేస్తుండడంతో ఇక తాను సైతం జనంలోకి వెళ్లాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. మరోసారి జనంబాట పట్టి అన్ని నియోజకవర్గాలను చుట్టేసి రావాలని కేసీఆర్ భావిస్తున్నారు. రెవిన్యూ సదస్సుల అనంతరం రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాలని డిసైడ్ అయిన గులాబీ బాస్ కేసీఆర్ టూర్ ఎలా ఉండాలన్న దానిపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రం మొత్తాన్ని చుట్టి వచ్చేలా టూర్‌ను ప్లాన్ చేస్తున్నారు కేసీఆర్. జిల్లాల్లో కలెక్టరేట్‌లు, టీఆర్ఎస్‌ పార్టీ కార్యాలయాలను ప్రారంభించాలని అదే సమయంలో ప్రతీ జిల్లాలో భారీ బహిరంగ సభలను కూడా నిర్వహించి ఎన్నికల హీట్‌ను రగిలించాలనే యోచనలో ఉన్నట్లు పార్టీ నేతలు చెప్తున్నారు. ఎన్నికలకు మరో ఏడాది ఉండడంతో ఈ ఏడాది సమయంలో ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేపడుతుందో ప్రజలకు సవివరంగా వివరించాలని కేసీఆర్ భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories