ఆ పని చేస్తే కిషన్ రెడ్డికి సన్మానాలు చేస్తాం : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె

ఆ పని చేస్తే కిషన్ రెడ్డికి సన్మానాలు చేస్తాం : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె
x
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్
Highlights

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్. కిషన్ రెడ్డికి తెలంగాణపై ప్రేమ ఉంటే కేంద్రాన్ని అడిగి కొత్త ప్రాజెక్టులు తీసుకురావాలని అన్నారు. హైదరాబాద్‌లో టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో కర్నె ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు.. రాష్ట్రానికి నిధులు ఇప్పిస్తే కిషన్ రెడ్డికి సన్మానాలు చేస్తామని చెప్పారు. మెట్రోకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు అడగొద్దని కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కర్నె డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డి ఢిల్లీ స్థాయి నాయకుడిలా మాట్లాడితే మంచిదని కర్నె హితవు పలికారు.

జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో రైలు ప్రారంభోత్సవం వ్యవహారంలో కిషన్ రెడ్డి అన్ని విషయాలు సరిగ్గా తెలుసుకొని ప్రవర్తిస్తే మంచిదని తెలిపారు. మెట్రోపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌లో జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో ప్రారంభోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వం పాటించాల్సిన ప్రొటోకాల్‌ను అనుసరించిందని తెలిపారు. కేంద్ర మంత్రులుగా ఉన్నవారు ఎవరైనా వారి సొంత రాష్ట్రాలకు నిధులు తీసుకెళ్లాలని చూస్తారని.. తెలంగాణ విషయంలో కిషన్‌రెడ్డి పూర్తిగా విభిన్నంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కేంద్రం నుంచి ఏదైనా ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు తెలంగాణకు తీసుకువస్తే కిషన్ రెడ్డికి సన్మానాలు చెస్తామని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల పట్ల కేంద్రం చూపిస్తున్న ప్రేమలో నాలుగో వంతైనా... తెలంగాణపై చూపితే ఎంతో అభివృద్ది చెందుతుందని కర్నె అన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories