టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో రైతులను ఆదుకున్నాం : మంత్రి ఎర్రబెల్లి

టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో రైతులను ఆదుకున్నాం : మంత్రి ఎర్రబెల్లి
x
Highlights

మిషన్ భగీరథను ఛాలెంజింగ్‌గా పూర్తిచేశామని.., 24 గంటల కరెంటు సాధ్యం చేసి చూపించామని ఎర్రబెల్లి అన్నారు. 30 రోజుల ప్రత్యేక ప్రణాళికలో రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతనిధులందరూ పాల్గొనాలని కోరారు.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు ఆడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇస్తున్నారు.

మిషన్ భగీరథను ఛాలెంజింగ్‌గా పూర్తిచేశామని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. 24 గంటల కరెంటు సాధ్యం చేసి చూపించామని ఆయన అన్నారు. 30 రోజుల ప్రత్యేక ప్రణాళికలో రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతనిధులందరూ పాల్గొనాలని కోరారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో రైతులను ఆదుకున్నామని రైతుబంధు పథకం రైతులకు మేలు చేసిందని ఎర్రబెల్లి అన్నారు. రెండోసారి అధికారం చేపట్టాక కాళేశ్వరంను ఛాలెంజింగ్‌గా తీసుకుని పూర్తిచేశామని తెలిపారు. గ్రామపంచాయతీలకు పూర్తి అధికారాలు ఇచ్చామని.., నిధులకు కొరత లేదని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories