ఇల్లందులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు..పోలీసులపై రాళ్లు రువ్విన ఆదివాసీలు

ఇల్లందులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు..పోలీసులపై రాళ్లు రువ్విన ఆదివాసీలు
x
Highlights

భద్రాద్రి జిల్లా ఇల్లందులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం ఎన్‌కౌంటర్‌లో మరణించిన న్యూడెమోక్రసీ మావోయిస్ట్‌ లింగన్న మృతదేహాన్ని అడవి...

భద్రాద్రి జిల్లా ఇల్లందులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం ఎన్‌కౌంటర్‌లో మరణించిన న్యూడెమోక్రసీ మావోయిస్ట్‌ లింగన్న మృతదేహాన్ని అడవి నుంచి బయటికి తీసుకొస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. లింగన్నను పట్టుకుని కాల్చిచంపారంటూ పోలీసులపై ఆదివాసీలు రాళ్లు రువ్వారు. ఆదివాసీల ఆందోళనతో పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు గాల్లోకి పది రౌండ్ల కాల్పులు జరిపారు. దాంతో ఇల్లందు అటవీ ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది. పరిస్థితిని సమీక్షిస్తున్న ఎస్పీ సునీల్‌ అదనపు బలగాలను మోహరించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories