పెద్దపల్లిలో విషాదం.. రైలు పట్టాలపై పని చేస్తుండగానే దూసుకెళ్లిన రాజధాని ఎక్స్‌ప్రెస్..

Three Killed While Working on the Track After hit by Rajdhani Express in Pedpadally
x

పెద్దపల్లిలో విషాదం.. రైలు పట్టాలపై పని చేస్తుండగానే దూసుకెళ్లిన రాజధాని ఎక్స్‌ప్రెస్..

Highlights

Rajdhani Express: పెద్దపల్లి జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది.

Rajdhani Express: పెద్దపల్లి జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది. పెద్దపల్లి మండలం కొత్తపల్లి శివారులో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు మృతి చెందారు. ట్రాక్ మరమ్మతులు చేస్తున్న సమయంలో రాజధాని ఎక్స్‌ప్రెస్ కార్మికులపైకి దూసుకొచ్చింది. రైల్వే ట్రాక్ గ్రీసింగ్ చేస్తున్న సమయంలో పక్క ట్రాక్ నుండి వెళ్తున్న గూడ్స్ రైలు శబ్దంతో రాజధాని ఎక్స్ ప్రెస్‌ను గమనించకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్టు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో రైల్వే సిబ్బంది దుర్గయ్య, దినసరి కూలీలు శ్రీనివాస్, వేణులుగా గుర్తించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories