మహిళ కళ్లల్లో కారం కొట్టి..హత్య చేసి.. దొంగల బీభత్సం

మహిళ కళ్లల్లో కారం కొట్టి..హత్య చేసి.. దొంగల బీభత్సం
x
Highlights

హైదరాబాద్‌ నగరంలో దోపిడీ దొంగల బీభత్సం సృష్టించారు. మహిళ కళ్లలో కారం చల్లి గొంతు నులిమి హత్య చేశారు. అమీన్‌పూర్‌లో ఓ ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళ...

హైదరాబాద్‌ నగరంలో దోపిడీ దొంగల బీభత్సం సృష్టించారు. మహిళ కళ్లలో కారం చల్లి గొంతు నులిమి హత్య చేశారు. అమీన్‌పూర్‌లో ఓ ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళ కళ్లల్లోకి కారంచల్లి గొంతు నులిమి దోపిడి దొంగలు హత్య చేశారు. అనంతరం ఆమె ఇంట్లోని నగలు, నగదు దోచుకెళ్లారు. ఇక వివరాల్లో్కి వెళితే అమీన్‌పూర్‌ అనురాగ్ కాలనీలో డాక్టర్ సురేందర్ గౌడ్ ఇంటిని దోచుకునేందకు వెళ్లారు దొంగలు. ఇంటి వెనకవైపు గేటునుంచి లోపలికి చొరబడ్డారు.

సురేందర్ గౌడ్ భార్య అరుంధతి ఒంటరిగా పూజా మందిరంలో ఉండంగా దొంగలు ఒక్కసారిగా ఆమెపై దాడికి దిగారు. ఇంట్లోని బంగారం, డబ్బంతా ఇవ్వకుంటే చంపేస్తామంటూ బెదిరించారు. అయితే వారి నుండి తప్పించుకునేందుకు యత్నించిన అరుంధతి కళ్లలో కరం చల్లారు. ఆ భాద తట్టుకోలేక కేకలు వేయడంతో భయపడ్డ దొంగలు ఆమె గొంతు నుమిలి ఊపిరాడకుండా చేసి చంపేశారు. డ్యూటి ముగించుకొని ఇంటికి చేరుకున్న సురేందర్ అరుంధతి శవాన్ని చూసి కంగుతిన్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే ఘటనా స్థలాన్ని పోలీసులు, క్లూస్‌ టీం పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories