మేడారంలో మాయమయ్యాడు... యాదాద్రిలో ప్రత్యక్ష మయ్యాడు..!

మేడారంలో మాయమయ్యాడు... యాదాద్రిలో ప్రత్యక్ష మయ్యాడు..!
x
Highlights

మేడారం లో ఈ నెల 6 వ తేదీన అదృశ్యమైన బాలుడు ఎట్టకేలకు తల్లిదండ్రుల ఒడికి చేరుకున్నాడు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కణాల గ్రామానికి చెందిన అనిల్,...

మేడారం లో ఈ నెల 6 వ తేదీన అదృశ్యమైన బాలుడు ఎట్టకేలకు తల్లిదండ్రుల ఒడికి చేరుకున్నాడు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కణాల గ్రామానికి చెందిన అనిల్, యమున దంపతుల మూడేళ్ల కుమారుడు సాయి శశాంక్‌ మేడారం జాతరలో తప్పిపోయాడు. అయితే అప్పటి నుంచి కనిపించని బాలుడు ఇవాళ యాదాద్రిలో ప్రత్యక్షమయ్యాడు. ఇవాళ తెల్లవారుజామున యాదాద్రి పోలీసులు తల్లిదండ్రులకు శశాంక్‌ను అప్పగించారు.

గుండాల మండలం పెద్దపాఠశాల గ్రామానికి చెందిన పందిరి జయమ్మ అనే వృద్ధురాలు శశాంక్‌ను యాదాద్రి పోలీసులకు అప్పగించింది. దీంతో పోలీసులు శశాంక్‌ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో.. తమ బిడ్డను అక్కునచేర్చుకున్నారు. 4 రోజుల తర్వాత బిడ్డ కనిపించడంతో తల్లిదండ్రులు ఆనందపరవశులయ్యారు.

లక్షలాదిగా ఒక్కచోట చేసుకునే సంబరం.. గిరిజన కుంభమేళా.. మేడారం జాతరకు కుటుంబ సమేతంగా రావడం.. ఆనవాయితీగా వస్తుంది. దీంతో చిన్నారులు తప్పిపోతుంటారు. అలాగే ఈ నెల 6 న జాతర సమయంలో శశాంక్ కూడా తప్పిపోయాడు. దీంతో పిల్లాడి కోసం తల్లిదండ్రులు తీవ్రంగా గాలించారు. ఇటు పోలీసులకు కూడా సమాచారం అందించారు. మరోవైపు ఈ విషయంపై హెచ్‌ఎంటీవీలో వరుస కథనాలు ప్రసారం అయ్యాయి. దీంతో పిల్లాడిని గుర్తించిన జయమ్మ విషయాన్ని పోలీసులకు చేరవేసింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories