Telangana Gurukulam: తెలంగాణా గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశ పరీక్ష నేడే!

Telangana Gurukulam: తెలంగాణా గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశ పరీక్ష నేడే!
x

TGCET (file image)

Highlights

Telangana Gurukulam: తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాల్లో ఐదో త‌ర‌గ‌తి ప్రవేశాల కోసం నిర్వహించే టీజీసెట్ ఈరోజు (నవంబర్ 1) జ‌రుగ‌నుంది.

Telangana Gurukulam | తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాల్లో ఐదో త‌ర‌గ‌తి ప్రవేశాల కోసం నిర్వహించే టీజీసెట్ ఈరోజు (నవంబర్ 1) జ‌రుగ‌నుంది. రాష్ట్ర వ్యాప్తంగా 433 కేంద్రాల్లో ఉద‌యం 11 నుంచి మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు ఈ పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 1,48,168 మంది విద్యార్థులు టీజీసెట్ కు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. నిజానికి ఈ పరీక్ష ఏప్రిల్ 12న జ‌ర‌గాల్సి ఉంది. క‌రోనా కార‌ణంగా అప్పుడు వాయిదా ప‌డింది. క‌రోనా నేప‌థ్యంలో ప్రవేశ పరీక్ష నిర్వహణ కోసం అధికారులు ప్రత్యెక ఏర్పాట్లు చేశారు. గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. ఉదయం 11 గంటల 5 నిమిషాలకు ఈ పరీక్ష ప్రారంభమవుతుందని, ఆ తర్వాత ఎవరినీ హాలులోకి అనుమతించేదిలేద‌‌ని స్పష్టంచేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories