
Komati Reddy Venkata Reddy: త్వరలో 265 ఏఈల పోస్టుల భర్తీ: మంత్రి కోమటిరెడ్డి
Komati Reddy Venkata Reddy: తెలంగాణ రాష్ట్ర రోడ్లు & భవనాల (R&B) శాఖలో ఖాళీగా ఉన్న ఇంజినీర్ల పోస్టుల భర్తీపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. శాఖలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న 265 ఇంజినీర్ల పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ నియామకాల ద్వారా శాఖ పనితీరును మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు.
ఫీల్డ్లో పనిచేస్తున్న అసిస్టెంట్ ఇంజినీర్లకు (AEలు) సాంకేతికంగా మరింత సౌకర్యం కల్పించేందుకు ల్యాప్టాప్లు అందజేస్తామని మంత్రి ప్రకటించారు. దీని ద్వారా పనుల్లో వేగం పెరగడమే కాకుండా, ప్రాజెక్టుల పర్యవేక్షణ మరింత సమర్థవంతంగా జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే, ఇంజినీర్లలో ఎన్నాళ్లుగా పెండింగ్లో ఉన్న సీనియారిటీ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా R&B ఇంజినీర్ల డైరీ, క్యాలెండర్ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆవిష్కరించారు. శాఖ అభివృద్ధిలో ఇంజినీర్లు, ఉద్యోగుల పాత్ర కీలకమని ఆయన కొనియాడారు. తమ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు తనకు కుటుంబ సభ్యులతో సమానమని చెప్పడం గమనార్హం.
కార్యక్రమం అనంతరం మంత్రి ఉద్యోగులతో కలిసి భోజనం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రభుత్వం–ఉద్యోగుల మధ్య అనుబంధం మరింత బలపడాలన్న ఉద్దేశంతోనే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇంజినీర్లకు అవసరమైన మౌలిక వసతులు, సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ఎప్పుడూ సానుకూలంగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




