TG News Express | TG News Highlights | 24-12-2025 | 05:00 PM | TG Latest News Updates | hmtv
ఇప్పుడు తెలంగాణ ఎక్స్ప్రెస్ వార్తలు చూద్దాం. ఇళ్లస్థలాలు ఇవ్వాలంటూ నిర్మల్ జిల్లా కేంద్రంలో జర్నలిస్టులు ఆర్డిఓ కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేపెట్టారు. ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్ల స్థలాలు ఇచ్చేవరకు నిరాహార దీక్షలు కొనసాగిస్తామని హెచ్చరించారు. సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోయినందుకు వార్డు సభ్యులపై దాడికి పాల్పడ్డ ఘటన అసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. బోర్లగుంట గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో తమకు ఓటు వేయలేదన్న కోపంతో అభ్యర్థి భర్త వార్డు సభ్యులపై దాడి చేశాడు. దీంతో వార్డు సభ్యుడికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. దారికి పాల్పడ్డ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని బాధ్యతలు డిమాండ్ చేశాడు. హైదరాబాద్ లబ్దిగాపూర్లో మహిళా కమిషన్ ఆధ్వర్యంలో నారీ న్యాయ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళల మంచి నేరుగా ఆర్జీలు పెండింగ్ లో ఉన్న ఫిర్యాదులను మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరేల శారదా స్వీకరించారు. ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం బోడమంచ తండాలో దారుణం చోడు చేసుకుంది. భూహ్య వీరన్న అనే రైతు హత్యకు గురయ్యాడు. వీరన్నను గొడ్డలతో నరికి హత్య చేసి రహదారి ప్రమాదంగా చిత్రీకరించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దున్నగలపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆర్మూరు జిల్లా అంకాపూర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ పై వెళ్తున్న సాయి ప్రసాద్ అనే వ్యక్తి ఆటోను డీకొట్టాడు. ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మిగతా వారికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిని స్థానికులు ఆసుపత్రికి తరళంచారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో విషాదం చోటు చేసుకుంది. పేట్ సంఘం నుండి చద్మాల్ తండాకు వెళ్తుండగా ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రాబ్ సింగ్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇద్దరికీ తీవ్ర గాయాలు ఇవ్వడంతో స్థానికులు వారిని ఆసుపత్రికి తర్లించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపెట్టారు.




