ప్రగతిభవన్‌ దగ్గర ఉద్రిక్తత

* సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి బీజేపీ కార్పొరేటర్ల యత్నం * నూతన పాలకమండలి ఏర్పాటు చేయాలని డిమాండ్ * బీజేపీ కార్పొరేటర్లను అడ్డుకున్న పోలీసులు.. పలువురు అరెస్ట్

Sandeep Eggoju
Published on: 5 Jan 2021 1:47 PM IST
ప్రగతిభవన్‌ దగ్గర ఉద్రిక్తత
X

ప్రగతిభవన్‌ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి బీజేపీ కార్పొరేటర్లు యత్నించారు. నూతన పాలక మండలిని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తాము గెలిచి నెలరోజులు అవుతున్నా ఎలాంటి గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బీజేపీ కార్పొరేటర్లను అడ్డుకున్న పోలీసులు.. పలువురిని అరెస్ట్ చేసి పోలీస్‌ స్టేషన్లకు తరలించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story