టెన్త్‌ పరీక్షలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌

టెన్త్‌ పరీక్షలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌
x
Highlights

తెలంగాణలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. జూన్‌ మొదటివారం తర్వాత టెన్త్‌ పరీక్షలు నిర్వహించుకోవచ్చని న్యాయస్థానం...

తెలంగాణలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. జూన్‌ మొదటివారం తర్వాత టెన్త్‌ పరీక్షలు నిర్వహించుకోవచ్చని న్యాయస్థానం స్పష్టం చేసింది. పదోతరగతి పరీక్షల నిర్వహణపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఇరు వైపులా వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం జూన్‌ మొదటి వారం తర్వత పరీక్షలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది.

జూన్‌ 3న పరిస్థితిని సమీక్షించి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తే కనుక కరోనా నివారణ జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని ప్రభుత్వానికి సూచించింది హైకోర్టు. పరిస్థితి తీవ్రంగా ఉంటే పరీక్షలు నిర్వహించవద్దని న్యాయస్థానం ఆదేశించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories