తెలంగాణ హైకోర్టుకు నలుగురు కొత్త న్యాయమూర్తులు.. కేంద్రం ఆమోదం, రాష్ట్రపతి ఉత్తర్వులు

Ramya Vegirouthu
Published on: 28 July 2025 8:58 PM IST
తెలంగాణ హైకోర్టుకు నలుగురు కొత్త న్యాయమూర్తులు.. కేంద్రం ఆమోదం, రాష్ట్రపతి ఉత్తర్వులు
X

తెలంగాణ హైకోర్టుకు నలుగురు కొత్త న్యాయమూర్తులు.. కేంద్రం ఆమోదం, రాష్ట్రపతి ఉత్తర్వులు

తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల కొరతను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. సుప్రీంకోర్టు కోలీజియం ఇటీవల చేసిన సిఫారసులను ఆమోదించిన కేంద్రం, నలుగురు కొత్త జడ్జిల నియామకాన్ని ఆమోదిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ నియామకాలతో గాడి ప్రవీణ్‌కుమార్‌, చలపతిరావు, వాకిటి రామకృష్ణారెడ్డి, గౌస్‌ మీరా మొహుద్దీన్‌లను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించారు. వారు త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

సుప్రీంకోర్టు కోలీజియం ఈ నియామకాల కోసం అభ్యర్థుల న్యాయ అనుభవం, నిబద్ధత, నైపుణ్యం వంటి అంశాలను విపులంగా పరిశీలించిన అనంతరం పేర్లు సిఫారసు చేసింది. కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, ఈ కొత్త నియామకాలు హైకోర్టు పనితీరును మెరుగుపరిచే అవకాశం ఉన్నదని న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు.

ఈ నిర్ణయంతో హైకోర్టు కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేయడానికి దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.

Ramya Vegirouthu

Ramya Vegirouthu

Next Story