e-governance in Telangana: ఈ పాలన వైపు తెలంగాణా..ఎలా ఉండబోతోంది అంటే..

e-governance in Telangana: ఈ పాలన వైపు తెలంగాణా..ఎలా ఉండబోతోంది అంటే..
x
ప్రతీకాత్మక చిత్రం
Highlights

e-governance in Telangana: నిన్న మొన్నటి వరకు రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలలో పెన్ను పేపరుతో పనులను చేసేవారు. ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వాలు కాగితంతో పనిలేకుండా పాలన సాగించాలని అనుకుంటున్నా అది ఆచరణలోకి రాలేదు.

నిన్న మొన్నటి వరకు రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలలో పెన్ను పేపరుతో పనులను చేసేవారు. ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వాలు కాగితంతో పనిలేకుండా పాలన సాగించాలని అనుకుంటున్నా అది ఆచరణలోకి రాలేదు. కానీ ప్రస్తుతం కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో పేపర్‌ ఫైళ్లు ఉపయోగించే పాత పద్దతికి స్వస్తి చెప్పి కొత్త పద్దతులకు స్వాగతం పలకనున్నారు. ఇందులో భాగంగానే డిజిటల్‌ ఫైలింగ్‌ విధానాన్ని అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం ఈ-పాలనను ప్రారంభిస్తోంది తెలంగాణ ప్రభుత్వం.

ఈ పాలన విధానాన్ని అమలులోకి తీసుకువచ్చిన తరువాత రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా... దాన్ని సీఎం కేసీఆర్...డిజిటల్ ఫార్మాట్‌లో వీడియో కాన్ఫరెన్సుల ద్వారా చూస్తారు. అన్నింటికీ పక్కా ఆధారాలుంటాయి. పూర్తి పారదర్శకమైన పాలన రాబోతోంది. అదే విధంగా ప్రభుత్వ కార్యకలాపాలన్నీ పేపర్‌తో పనిలేకుండా అంతా ఆన్‌లైన్ రూపంలో జరుగుతాయి. చర్చలు, సమావేశాలన్నీ ఆన్‌లైన్‌లోనే. ఏ ఫైలైనా... ఆన్‌లైన్ పరమే. ఏ నిర్ణయమైనా... డిజిటల్‌లోనే. సంప్రదాయ సంతకాల స్థానంలో డిజిటల్ సిగ్నేచర్స్ ఉంటాయి.

దీని వల్ల చాలా లాభాలున్నాయి. ఏ ఫైల్ ఏ అధికారి దగ్గర పెండింగ్ ఉందో తెలుసుకొని, సంబంధిత అధికారిని వెంటనే పని పూర్తి చెయ్యమని సీఎం ఆఫీస్ వర్గాలు కోరే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఏ ఫైల్ ఏ దశలో ఉందో క్షణాల్లో అది సెర్చ్ ఆప్షన్‌లో కనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు ఇంట్లో ఉండి కూడా ఫైళ్లను ఆన్‌లైన్‌లో తెరచి చూసి ఓకే చెయ్యొచ్చు. అలాగే పనిలో కచ్చితత్వమూ ఉంటుంది. కాలయాపన తగ్గుతుంది.

నీటి ప్రాజెక్టుల పనుల్లో అభివృద్ధి, ప్రభుత్వ సహాయ చర్యలు, ప్రభుత్వ పథకాల అమలు వంటి అన్ని అంశాల్నీ సీఎం కేసీఆర్ పరిశీలిస్తారు. ఈ క్రమంలోనే ప్రతి సోమవారం ప్రభుత్వం జిల్లా కలెక్టరేట్లలో DDRC సమావేశాలు నిర్వహించనుంది. అలాగే శాఖల వారీగా ఐడీ, పాస్‌వర్డ్‌లను ఇవ్వనున్నారు. ఏ జిల్లాలో ఏ లోటుపాట్లున్నా వెంటనే వాటిని సరిచేస్తారు. అంతా ఆన్‌లైన్ అయినప్పటికీ కేబినెట్ సమావేశాలు, తీసుకునే నిర్ణయాలపై మాత్రం సీక్రెసీ మెయింటేన్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

తహశీల్దార్, MPDO, RDO, DPO ఇలా విభాగాలన్నీ ఆన్‌లైన్‌లోనే ఫైళ్లను చెక్ చేసి ఆమోదిస్తాయి. తద్వారా కలెక్టరేట్లు, మండల, డివిజన్, ఇతర ఆఫీసుల్లో ఈ-పాలన అమలవుతుంది. ప్రజలు పెట్టుకునే అర్జీలు, ప్రతిపాదనలన్నీ స్కాన్ అవుతాయి. సంబంధిత కలెక్టర్లేట్లకు ఆన్‌లైన్‌లో వెళ్తాయి. అంటే ప్రజలు ఇచ్చే అర్జీలు పేపర్ల రూపంలో ఉన్నా ప్రభుత్వం మాత్రం వాటిని ఆన్‌లైన్ స్కానింగ్ ప్రతుల రూపంలోనే చూడనుంది.

అలాగే ఫైళ్లను బార్ కోడింగ్ చేస్తారని తెలిసింది. పోలీస్ కమాండ్ కంట్రోల్ సిస్టం ద్వారా అన్ని జిల్లాలు, ఆఫీసుల్లో డిజిటల్ కాన్ఫరెన్సింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కువ మంది ఒకేసారి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు వీలుగా సాఫ్ట్‌వేర్లను అప్‌గ్రేడ్ చేస్తున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories