Telangana Government: పెళ్లి చేసుకునే జంటలకు గుడ్ న్యూస్.. ప్రోత్సాహకం రూ.2 లక్షలు.. నేటి నుంచి అమల్లోకి..!!

Telangana Government: పెళ్లి చేసుకునే జంటలకు గుడ్ న్యూస్.. ప్రోత్సాహకం రూ.2 లక్షలు.. నేటి నుంచి అమల్లోకి..!!

Dhivi
Published on: 18 Jan 2026 5:49 AM IST
Telangana Government: పెళ్లి చేసుకునే జంటలకు గుడ్ న్యూస్.. ప్రోత్సాహకం రూ.2 లక్షలు.. నేటి నుంచి అమల్లోకి..!!
X

Telangana Government: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమాన్ని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. దివ్యాంగుల వివాహాలకు అందించే ఆర్థిక సహాయాన్ని గణనీయంగా పెంచుతూ ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు రూ.1 లక్షగా ఉన్న వివాహ ప్రోత్సాహకాన్ని రూ.2 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ చర్య ద్వారా దివ్యాంగులకు సామాజిక భద్రతతో పాటు ఆర్థిక స్థిరత్వం కల్పించాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వ ఉద్దేశ్యంగా పేర్కొంది.

ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం, ఇద్దరు దివ్యాంగులు పరస్పరం వివాహం చేసుకున్న సందర్భంలోనే పెంచిన ప్రోత్సాహక నగదు వర్తిస్తుంది. ఈ మొత్తం నేరుగా భార్య పేరుతో ఉన్న బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు. వివాహానంతరం కొత్త జీవితం ప్రారంభించే దివ్యాంగ దంపతులకు గృహ అవసరాలు, వైద్య ఖర్చులు, ఇతర మౌలిక అవసరాలకు ఈ ఆర్థిక సహాయం తోడ్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

దివ్యాంగుల కోసం వివాహ ప్రోత్సాహకంతో పాటు ఇతర సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రభుత్వం విస్తృతంగా అమలు చేయనుంది. సుమారు రూ.50 కోట్ల వ్యయంతో కృత్రిమ అవయవాలు, వీల్ చైర్లు, మూడు చక్రాల సైకిళ్లు, వినికిడి యంత్రాలు వంటి సహాయక పరికరాలను ఉచితంగా అందించేందుకు ప్రణాళిక రూపొందించింది. శారీరక వైకల్యం వారి ఎదుగుదలకు అడ్డంకి కాకుండా ఉండేలా అవసరమైన అన్ని మద్దతు సౌకర్యాలు కల్పించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

సమాజంలో దివ్యాంగుల పట్ల ఉన్న వివక్షను తొలగించి, వారిని గౌరవంగా జీవించేలా చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేసింది. ఇందుకోసం ప్రభుత్వ ఉద్యోగాల్లో దివ్యాంగులకు కేటాయించిన రిజర్వేషన్లను కఠినంగా అమలు చేయడంతో పాటు, విద్యావంతులైన దివ్యాంగులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు చేపడుతోంది. పారాలింపిక్స్‌లో ప్రతిభ చూపిన క్రీడాకారులకు ఉద్యోగాలు కల్పించడం ద్వారా ఇప్పటికే ప్రభుత్వం తన సంకల్పాన్ని చాటిందని పేర్కొంటోంది.

దివ్యాంగుల సంక్షేమంతో పాటు వృద్ధులు, పిల్లలు వంటి ఇతర బలహీన వర్గాల కోసం కూడా ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోంది. వృద్ధుల కోసం ‘ప్రణామ్’ డే కేర్ కేంద్రాలు, పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ‘బాల భరోసా’ వంటి పథకాలు ఇందుకు ఉదాహరణలు. దివ్యాంగులు అన్ని రంగాల్లో ముం

Dhivi

Dhivi

Next Story