సీఎం దొరగారికి బాధ ఎలా ఉంటుందో తెలుస్తున్నట్లు ఉంది.. విజయశాంతి సెటైర్లు

సీఎం దొరగారికి బాధ ఎలా ఉంటుందో తెలుస్తున్నట్లు ఉంది.. విజయశాంతి సెటైర్లు
x
Vijaya Shanthi, KCR (File Photo)
Highlights

తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రతిపక్ష ఎమ్మెల్యేల మెడపై కత్తి పెట్టి వారిని లొంగతీసుకుంటున్నారని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి విమర్శించారు....

తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రతిపక్ష ఎమ్మెల్యేల మెడపై కత్తి పెట్టి వారిని లొంగతీసుకుంటున్నారని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి విమర్శించారు. కేంద్రం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీపై సీఎం స్పందించిన తీరు గందరగోళంగా ఉందని ఆమె అన్నారు.

''ప్రత్యర్థుల మెడపై కత్తి పెట్టి.. వారిని లొంగదీసుకునే విషయంలో బాధ ఎలా ఉంటుందో సీఎం దొరగారికి ఇప్పుడే తెలుస్తున్నట్లు ఉంది. మరో అంశం ఏమిటంటే కేంద్రం సంస్కరణల పేరుతో సంక్షేమ పథకాలను నీరుగార్చి పేదల పొట్ట కొట్టాలనుకుంటోందని కేసీఆర్ గారు ఆరోపించారు. కానీ ఒక దేశం ఒక రేషన్ కార్డు వంటి కొన్ని సంస్కరణలను ఇప్పటికే తెలంగాణలో అమలు చేశామని సీఎం దొరగారు చెబుతున్నారు. మరి కేంద్రం ప్రతిపాదించిన సంస్కరణలు తప్పయితే కేంద్రం కంటే ముందు వాటిని తెలంగాణలో ఎందుకు అమలు చేశారు అనే విషయంపై కేసీఆర్ వివరణ ఇవ్వాలి.'' అని డిమాండ్ చేశారు.

కరోనా ప్రభావం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజ్‌పై సీఎం కేసీఆర్ గారు స్పందించిన తీరు అయోమయంగా ఉందని తెలంగాణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును చూస్తుంటే.. ఫెడరల్ వ్యవస్థకు తూట్లు పొడిచే విధంగా ఉందని కెసిఆర్ గారు ఆరోపించారు. సంస్కరణల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం మెడపై కత్తి పెట్టి.. కేంద్రం తన దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తోందని కేసీఆర్ గారు విమర్శించారు. కేంద్రం ఫెడరల్ వ్యవస్థను తూట్లు పొడుస్తోందని ఆరోపించే ముందు.. తెలంగాణలో సీఎం దొరగారు అభివృద్ధిని సాకుగా చూపించి ప్రతిపక్ష ఎమ్మెల్యేల మెడపై కత్తి పెట్టి.. వారిని లొంగదీసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలంగాణ సమాజం గుర్తు చేసుకుంటోందని వ్యాఖ్యానించారు.








Show Full Article
Print Article
More On
Next Story
More Stories