రెండో విడత పాదయాత్రకు సిద్ధమవుతున్న తెలంగాణ బీజేపీ చీఫ్

*ఏప్రిల్ 14న అంబేద్కర్‌ జయంతి రోజున బండి‌ సంజయ్ రెండో విడత పాదయాత్ర

Rama Rao
Published on: 28 Feb 2022 3:53 PM IST
Telangana BJP Chief Bandi Sanjay Preparing for the Second Installment of the Padayatra
X

రెండో విడత పాదయాత్రకు సిద్ధమవుతున్న తెలంగాణ బీజేపీ చీఫ్

Bandi Sanjay: రెండో విడత పాదయాత్రకు సిద్ధమవుతున్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. ఏప్రిల్ 14న అంబేద్కర్‌ జయంతి రోజున బండి‌ సంజయ్ రెండో విడత పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ సమావేశాలు ముగిశాక ప్రజా సంగ్రామ యాత్రకు సన్నద్ధమవుతున్నారు.

అసెంబ్లీ ఎన్నికల వరకు ప్రజల్లోనే ఉండాలని బీజేపీ అధ్యక్షుడు నిర్ణయించుకున్నారు. మొదటి విడత పాదయాత్ర 36 రోజులు పాటు సాగింది. రెండో విడతలో 200 రోజుల పాటు పాదయాత్ర చేయాలని నిర్ణయించారు బండి సంజయ్. అయితే ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి రెండో విడత పాదయాత్ర చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Rama Rao

Rama Rao

Next Story