Tejeswar Murder Case: ‘హనీమూన్‌ మర్డర్‌ కేసులా దొరకకూడదని ప్లాన్’ – గద్వాల సర్వేయర్‌ హత్య కేసులో షాకింగ్‌ విషయాలు బయటకు!

Tejeswar Murder Case: గద్వాలలో సర్వేయర్‌ తేజేశ్వర్ హత్య వెనుక భార్య ఐశ్వర్య, ప్రియుడు తిరుమల్ రావు పక్కా ప్లాన్. హనీమూన్‌ మర్డర్‌ కేసుల్లా కనిపించకుండా ప్లాన్ చేసిన ఘట్టాలు… వివరాలు తెలుసుకోండి!

Vineela Sekhar
Published on: 26 Jun 2025 5:42 PM IST
Tejeswar Murder Case: ‘హనీమూన్‌ మర్డర్‌ కేసులా దొరకకూడదని ప్లాన్’ – గద్వాల సర్వేయర్‌ హత్య కేసులో షాకింగ్‌ విషయాలు బయటకు!
X

Tejeswar Murder Case: ‘హనీమూన్‌ మర్డర్‌ కేసులా దొరకకూడదని ప్లాన్’ – గద్వాల సర్వేయర్‌ హత్య కేసులో షాకింగ్‌ విషయాలు బయటకు!

గద్వాలలో భార్య కుట్ర.. ప్రియుడితో కలిసి భర్త హత్య.. హనీమూన్ మర్డర్ కేసు ప్లాన్‌!

గద్వాల జిల్లాలో సంచలనంగా మారిన సర్వేయర్‌ తేజేశ్వర్‌ హత్య కేసులో షాకింగ్‌ నిజాలు వెలుగుచూశాయి. ఈ హత్య వెనుక తేజేశ్వర్ భార్య ఐశ్వర్య, ఆమె ప్రియుడు తిరుమల్ రావు ఉన్నట్లు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు గురువారం మీడియాకు వెల్లడించారు.

వివాహం తర్వాత నెలకే హత్య కుట్ర.. ప్రణాళిక మొదలైన తీరు

  • తేజేశ్వర్, ఐశ్వర్యలకు గతేడాది డిసెంబర్‌లో నిశ్చితార్థం కాగా, పెళ్లి తర్వాత నెల రోజుల్లోనే ఆమె ప్రియుడు, బ్యాంక్ మేనేజర్‌ తిరుమల్‌రావుతో కలిసి భర్త హత్యకు కుట్ర పన్నారు.
  • తేజేశ్వర్‌ను చంపేందుకు సుపారీ గ్యాంగ్‌ను ఏర్పాటు చేసి రహస్యంగా GPS అమర్చారు.
  • ఆయన కదలికలను తెలుసుకొని, పొలం చూద్దామని కారులో తీసుకెళ్లి వేట కొడవళ్లతో హత్య చేశారు.
  • అనంతరం మృతదేహాన్ని గాలేరు-నగరి కాల్వలో పడేశారు.

హనీమూన్ మర్డర్ కేసును ప్రేరణగా తీసుకున్న నిందితులు

తాజాగా మేఘాలయలో జరిగిన హనీమూన్ మర్డర్ కేసును చర్చించుకున్న నిందితులు, అదే తరహాలో పోలీసులకు దొరక్కుండా ఉండేలా ప్లాన్ చేశారని ఎస్పీ పేర్కొన్నారు. తిరుమల్ రావు ఐశ్వర్యతో రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడని, హత్య తర్వాత లద్దాఖ్‌ టూర్‌కు వెళ్లాలనే ఉద్దేశం కూడా ఉన్నట్లు తెలిపారు.

వివాహేతర సంబంధమే హత్యకు కారణం

ఈ కేసులో మరో షాకింగ్ ఎలిమెంట్ ఏమిటంటే, తిరుమల్‌రావుకు ఐశ్వర్య తల్లి‌తో కూడా సంబంధం ఉండటం. ఇది కేసును మరింత క్లిష్టం చేసింది. ఇప్పటి వరకు ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.

తాజా కేసు ట్విస్టులు: దారుణంగా నడిచిన హత్య, ప్లాన్‌ వివరాలు

ఈ కేసు తెలుగు రాష్ట్రాల్లో వివాహేతర సంబంధాల కారణంగా జరిగే హత్యలలో అత్యంత ప్రణాళికాబద్ధంగా జరిపిన ఘటనగా నిలిచింది. సామాన్యంగా జరిగే మర్డర్ కేసులకు మించి పలు మలుపులతో ఈ కేసు పోలీసుల దృష్టిలోకి వచ్చింది.

Vineela Sekhar

Vineela Sekhar

Next Story