హుజుర్ నగర్ ఉపఎన్నికల్లో టీడీపీ కూడా పోటీ

హుజుర్ నగర్ ఉపఎన్నికల్లో టీడీపీ కూడా పోటీ
x
Highlights

హుజుర్ నగర్ ఉపఎన్నికల్లో తమ పార్టీ కూడా పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు టీడీపీ నేతలు. ఆదివారం తమ అభ్యర్థి పేరును ప్రకటిస్తున్నట్టు వెల్లడించారు....

హుజుర్ నగర్ ఉపఎన్నికల్లో తమ పార్టీ కూడా పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు టీడీపీ నేతలు. ఆదివారం తమ అభ్యర్థి పేరును ప్రకటిస్తున్నట్టు వెల్లడించారు. పొత్తులో భాగంగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చింది. అయితే ఈసారి ఒంటరిగానే బరిలోకి దిగాలని నిర్ణయం తీసుకుంది ఆ పార్టీ. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో తెలంగాణ సీనియర్ నేతలు భేటీ అయ్యారు. సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఉపఎన్నికల్లో పోటీ చెయ్యాలని టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇక అధికార తెరాస నుంచి శానంపూడి సైదిరెడ్డి, కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ పద్మావతిరెడ్డి, బీజేపీ నుంచి కోటా రామారావు బరిలోకి దిగుతుండగా.. తాజాగా టీడీపీ కూడా బరిలో నిలిచింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories