తహశీల్దార్ విజయారెడ్డి కేసు: అటెండర్ చంద్రయ్య మృతి..!

తహశీల్దార్ విజయారెడ్డి కేసు: అటెండర్ చంద్రయ్య మృతి..!
x
చంద్రయ్య
Highlights

హైదరాబాద్ అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం కేసులో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. మంటల్లో కాలిపోతున్న విజయారెడ్డిని కాపాడే ప్రయత్నంలో...

హైదరాబాద్ అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం కేసులో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. మంటల్లో కాలిపోతున్న విజయారెడ్డిని కాపాడే ప్రయత్నంలో అటెండర్ చంద్రయ్య తీవ్ర గాయాలపాలయ్యాడు. దీంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. గత కొన్ని రోజులుగా కాంచన్‌బాగ్‌లోని డీఆర్‌డీవో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చంద్రయ్య ఈ ఉదయం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. చంద్రయ్య మృతితో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నరవుతున్నారు.

చంద్రయ్య కుటుంబానికి ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని బంధువులు డిమాండ్‌ చేస్తున్నారు. కాగా విజయారెడ్డిపై సురేష్‌ పెట్రోల్‌ పోసి నిప్పంటిచగా ఆమె ఘటనా స్థలంలోనే కన్నుమూసింది. ఎమ్మార్వోను కాపాడేందుకు ప్రయత్నించిన ఆమె కారు డ్రైవర్‌ గురునాథానికి మంటలంటుకోవడంతో మరుసటిరోజే మృతి చెందాడు. అలాగే ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నిందితుడు సురేష్‌ డిఆర్డిఓలో చికిత్స పొందుతూ నవంబర్‌ 7న మరణించాడు. ఈ ఘటనలో మొత్తంగా నలుగురు మరణించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories