దిశ కేసులో నిందితుల కస్టడీపై కొనసాగుతున్న సస్పెన్స్‌.. ఏ క్షణంలోనైనా ..

దిశ కేసులో నిందితుల కస్టడీపై కొనసాగుతున్న సస్పెన్స్‌.. ఏ క్షణంలోనైనా ..
x
Highlights

దిశ కేసులో నిందితుల కస్టడీపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఏ క్షణంలోనైనా నిందితులను కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే షాద్‌నగర్‌ పోలీసులు...

దిశ కేసులో నిందితుల కస్టడీపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఏ క్షణంలోనైనా నిందితులను కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే షాద్‌నగర్‌ పోలీసులు చర్లపల్లి జైలుకు చేరుకున్నారు. రాత్రి 10 గంటల తర్వాత నలుగురు నిందితులను పోలీసులు కస్టడీకి తీసుకునే ఛాన్స్ ఉంది. నిందితులను ఎన్ని రోజుల పాటు కస్టడీకి అనుమాతించారనేది గోప్యంగా ఉంచుతున్నారు. విచారణను గోప్యంగా ఉంచాలని పోలీసులకు ఉన్నతాధికారుల ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

వెటర్నరీ డాక్టర్‌ అత్యాచార ఘటనపై దేశ వ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. నలుగురు కర్కశకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద విద్యార్థులు ధర్నాకు దిగారు. వీ వాంట్ జస్టిస్‌ అంటూ నినాదాలు చేశారు. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories