AP Telangana Lockdown: తెలంగాణ- ఆంధ్రా సరిహద్దులో ఆంక్షలు కఠినతరం

Strict Rules in  Telangana and Andhra Pradesh Border
x

తెలంగాణ ఆంధ్ర బోర్డర్ వద్ద చెక్ పోస్ట్ (ఫైల్ ఇమేజ్)

Highlights

AP Telangana Lockdown: బోర్డర్‌లో తెలంగాణ ప్రభుత్వం కొత్త ఆంక్షలు * ఏపీ నుంచి వచ్చే వారికి ఈ-పాస్‌ తప్పనిసరి

AP Telangana Lockdown: తెలంగాణ సరిహద్దుల్లో ఆంక్షలను పోలీసులు కఠినతరం చేశారు. ఏపీ నుంచి వచ్చేవారికి ఈ-పాస్‌ తప్పనిసరి చేశారు. అంబులెన్సులు, అత్యవసర వాహనాలకు మాత్రం మినహాయింపునిచ్చారు. అత్యవసర వాహనాలకు కూడా గుర్తింపు కార్డును తప్పనిసరి చేశారు. ఇక సూర్యపేట జిల్లా కోదాడ మండలం రామాపురం ఎక్స్‌ రోడ్డు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. లాక్‌డౌన్ సడలింపు ఉందని వాహనాలు భారీగా తరలివచ్చాయి. అయితే ఈ-పాస్ ఉన్నవారిని మాత్రమే పోలీసులు అనుమతిస్తున్నారు. ఈ-పాస్ లేని వాహనదారులను నిలిపివేయడంతో సరిహద్దుల వద్ద భారీ ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. సరుకు రవాణా వాహనాలకు కూడా 10 గంటల తర్వాత అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories