ఆస్తి కోసం... తల్లిదండ్రుల సజీవ దహనం

ఆస్తి కోసం... తల్లిదండ్రుల సజీవ దహనం
x
Highlights

తల్లిదండ్రులు పిల్లలను కని పెంచి పోషించి వారు పెద్దయ్యాక వారికి చేదోడు వాదోడుగా ఉంటారనుకుంటారు.

తల్లిదండ్రులు పిల్లలను కని పెంచి పోషించి వారు పెద్దయ్యాక వారికి చేదోడు వాదోడుగా ఉంటారనుకుంటారు. కాని ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులనే చంపేసే కొడుకులు సమాజంలో పెరుగుతున్నారు. వారు చనిపోయాక చితికి నిప్పంటించాల్సిన కొడుకు ఆస్తి కోసం బతికుండగానే కాల్చి చంపాడు. ఈ దారుణమైన

హృదయ విదారకమైన సంఘటన వరంగల్‌ రూరల్‌ జిల్లా నెక్కొండ మండలం మడిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల్లోకెలితే భూక్యా దస్రు (68)కి 10 ఎకరాలు భూమి ఉండేది. ఆ భూమిని కుమారులు కేతూరాంకు 3.30 ఎకరాలు, వీరన్నకు నాలుగెకరాలు పంచాడు. తనకి ఎంతో కొంత ఆసరా ఉండాలని తన పేరు మీద రెండున్నరెకరాల భూమి ఉంచుకున్నాడు. అయితే తన పెద్ద కొడుకు వీరన్న కొంతకాలం క్రితం చనిపోయాడు. దీంతో దస్రు తన పేరు మీద ఉన్న భూమిని వీరన్న భార్య పేరిట పట్టా చేయాలనుకున్నాడు. దీంతో తన ఇంకో కొడుకు కేతూరాం తల్లిదండ్రుల పైన పగ పెంచుకున్నాడు. దాంతో కేతూరాం అతని కొడుకు వెంకన్న ఇద్దరు బుధవారం సాయంత్రం ఆ వృద్ధ దంపతులను మంచానికి కట్టేసారు. వాళ్ళ వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఆ ఇద్దరిపై పోసి నిప్పంటించారు. దీంతో ఆ ఇంట్లో నుంచి పొగలు, మంటలు రావడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని గ్రామస్తులతో కలసి మంటలను ఆర్పారు. అప్పటికే మంచం మీద ఉన్న వృద్ధ దంపతులు మంటల్లో కాలి అస్తిపంజరాలుగా మారారు. వారితో పాటు కేతూరాం, వెంకన్నకు కుడా గాయాలయ్యాయి. దీంతో నెక్కొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స కోసం వెళ్ళిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories