Peddapalli: అన్నా.. ఇదే నీకు కట్టే చివరి రాఖీ.. సోదరుడి మృతదేహాన్ని పట్టుకుని గుండెలవిసేలా రోదించిన చెల్లెలు

Sister Tie Rakhi To Her Dead Brother On Rakhi Festival At Peddapalli District
x

Peddapalli: అన్నా.. ఇదే నీకు కట్టే చివరి రాఖీ.. సోదరుడి మృతదేహాన్ని పట్టుకుని గుండెలవిసేలా రోదించిన చెల్లెలు

Highlights

Peddapalli: శోకసంద్రంలో మునిగిపోయిన కనుకయ్య కుటుంబం

Peddapalli: పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం దూళికట్టలో విషాద ఘటన జరిగింది. రాఖీ పండగ సందర్భంగా సోదరుడికి రాఖీ కట్టేందుకు వచ్చిన ఆ సోదరికి ఊహించని ఘటన ఎదురైంది. గుండెపోటుతో మరణించిన సోదరుడికి రాఖీ కట్టింది ఓ సోదరి. ఈ హృదయ విదారక ఘటన అక్కడున్న వారందరిని కన్నీటి పర్యంతమయ్యేలా చేసింది. కనకయ్య అనే వ్యక్తి గుండెపోటుతో మరణించడంతో ఆ కుటుంబం తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది. రాఖీ పండగకు ఇంటికి వచ్చిన సోదరి గౌరమ్మ తన అన్న మరణాన్ని తట్టుకోలేకపోయింది. కన్నీళ్లను దిగమింగుతూ గుండెనిండా భారాన్ని మోస్తూ తన అన్నకు రాఖీ కట్టింది.

Show Full Article
Print Article
Next Story
More Stories