ఇవాళ పాదయత్రను పున:ప్రారంభించనున్న షర్మిల

* వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం లింగగిరి నుంచి పాదయాత్ర... పోలీసులనుంచి అనుమతి కోసం ఎదురుచూస్తున్న షర్మిల అనుచరులు

R Tripura Malini
Published on: 4 Dec 2022 6:36 AM IST
Sharmila Will Resume The Padayatra Today
X

ఇవాళ పాదయత్రను పున:ప్రారంభించనున్న షర్మిల

YS Sharmila: కేసీఆర్ ఉద్యమకారున్ని అంటూనే ఉద్యమకారులకు ద్రోహం చేశారని వైఎస్ షర్మిల మండిపడ్డారు. హైదరాబాద్ గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి చిత్రపటానికి షర్మిల నివాళులర్పించారు. తెలంగాణ బిడ్డలకు అభద్రతా భావాన్ని తొలగించడానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎంతో కృషి చేశారని షర్మిల గుర్తు చేశారు. ఇవాళ షర్మిల వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం లింగగిరి నుంచి పాదయాత్ర మొదలుపెట్టనున్నారు. అయితే పోలీసుల నుంచి ఇంకా అనుమతి రాలేదని YSRTP శ్రేణులు చెబుతున్నాయి. షర్మిల యాత్ర ఏదేమైనా కొనసాగుతుందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

R Tripura Malini

R Tripura Malini

Next Story