విద్యాశాఖ మంత్రి సబితకు గవర్నర్ అపాయింట్‏మెంట్

Sabitha Indra Reddy to Meet Governor Over Common Board for Recruitment in Universities
x

విద్యాశాఖ మంత్రి సబితకు గవర్నర్ అపాయింట్‏మెంట్

Highlights

Sabitha Indra Reddy: రాజ్‎భవన్ వర్సెస్ ప్రగతిభవన్ ఎపిసోడ్‎లో రేపు కీలక భేటీ జరగనుంది.

Sabitha Indra Reddy: రాజ్‎భవన్ వర్సెస్ ప్రగతిభవన్ ఎపిసోడ్‎లో రేపు కీలక భేటీ జరగనుంది. కామన్ రిక్రూట్‎మెంట్ బోర్డు ఏర్పాటుపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గవర్నర్ తమిళిసైకి వివరణ ఇవ్వనున్నారు. బిల్లును పెండింగ్‎లో పెట్టిన గవర్నర్ తనకు సందేహాలు ఉన్నాయని చెప్పారు. దీనిపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉన్నతాధికారులతో కలిసి రేపు గవర్నర్‎తో సమావేశం కానున్నారు.

రాజ్‎భవన్ వర్గాలు రేపు మధ్యాహ్నం రావాలని మంత్రికి అపాయింట్‎మెంట్ ఇచ్చాయి. తనకు గవర్నర్ అపాయింట్‎మెంట్ ఇంకా లభించలేదని మంత్రి సబిత అనడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తీరుపై నిన్న ప్రెస్‎మీట్‎లో గవర్నర్ తీవ్ర ఆరోపణలు చేశారు. తమిళిసై కామెంట్స్‎తో తెలంగాణలో పొలిటికల్ కాక రేపాయి. ఈ నేపథ్యంలో రేపు తమిళిసైతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి భేటీకానుండటం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories