ఆర్టీసీకి అద్దె బస్సుల యజమానుల షాక్‌

-పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్‌ -రేపటిలోగా బిల్లులు చెల్లించకపోతే బస్సులు నిలిపివేస్తామని అల్టిమేటం -సెప్టెంబర్ నుంచి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని ఆవేదన

admin1
Updated on: 13 Nov 2019 9:54 PM IST
RTC strike
X
RTC strike

ఆర్టీసీకి అద్దె బస్సుల యజమానులు షాక్‌ ఇచ్చారు. తమకు ఇవ్వాల్సిన పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. రేపటిలోగా బిల్లులు చెల్లించకపోతే బస్సులు నిలిపివేస్తామని హెచ్చరించారు. సెప్టెంబర్‌ నుండి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని.. డీజిల్‌కు, డ్రైవర్లకు జీతాలు ఇవ్వలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో బస్సుకు కనీసం లక్షా 50 వేల రూపాయలు ఇస్తే ఫైనాన్స్, డ్రైవర్ జీతాలు చెల్లించి బస్సులు నడుపుతామని తెలిపారు అద్దె బస్సుల యజమానులు.


admin1

admin1

Next Story