నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
x
నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
Highlights

నల్లగొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖమ్మం నుండి హైదరాబాద్ కి వెళ్తున్న కొత్తగూడెం డిపోకు చెందిన సూపర్ లగ్జరీ...

నల్లగొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖమ్మం నుండి హైదరాబాద్ కి వెళ్తున్న కొత్తగూడెం డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు, టీవీఎస్ వాహనాన్ని కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. బైక్ పై ఉన్న ముగ్గురిలో ఇద్దరు ఘటనాస్థలంలోనే మృతి చెందగా మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

చిట్యాలలో బంధువుల పెళ్లికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. రెండు నిమిషాల్లో ఫంక్షన్ హాల్‌కు చేరుకునే లోపు ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతులు చౌటుప్పల్ మండలం దండు మల్కాపూర్‌కు చెందిన వారుగా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories